చెన్నై : తమిళనాడులోని తుత్తుకుడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 9కి చేరింది. స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడి ప్రయత్నంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వి వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి కాల్పులు జరిపారు.