న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఈ రోజు ఆ రాష్ట్రానికి సంబంధించి రెండు కీలక నియామకాలు చేశారు. పార్టీ మధ్య ప్రదేశ్ కోర్డినేషన్ కమిటీ చైర్మన్ గా సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను నియమించారు. ఇక జ్యోతిరాదిత్య సింధియాను ఫార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా రాహుల్ నియమించారు.