తమిళనాడులోని తుత్తుకుడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టెరిలైట్ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు వంద రోజులుగా చేస్తున్న ఆందోళన ఈ రోజు రక్తసిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో పోలీసలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పాతిక మంది వరకూ గాయపడ్డారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఆందోళన కారులు కలెక్టరేట్ ను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్న వంద వాహనాలను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.