టిటిడి నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని టీటీడీ ఈ వో అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో టిటిడి అధికారుల సమావేశం ముగిసింది. అనంతరం టీటీడీ ఈవో విలేకరులతో మాట్లాడారు. ఆగమ శాస్త్రం ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని, పనులు నిర్వహిస్తున్నామని ఈవో అనీల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ముఖ్యమంత్రితో సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. నిన్న, మొన్న కొత్త విషయాలు వెలుగులోకి వచ్చయని చెప్పిన ఆయన అన్ని విషయాలలోనూ చట్ట పరంగా ముదుకు వెళతామని అన్నారు.