హైదరాబాద్ : టిటిడీలో ఆభరణాలకు గత ప్రభుత్వాలకు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ సంబంధం లేదని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి చెప్పారు. తమ శాఖ 2011లోనే తిరుమత తిరుపతి దేవస్థానంలో ఉన్న పురాతన ఆభరణాలను పరిశీలించామని ఆయన చెప్పారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన తిరుమలతో పాటు పలు పురాతన ఆలయాలకు శ్రీకృష్ణ దేవరాయలు పలు విలువైన ఆభరణాలు ఇచ్చారని అయితే వాటి రికార్డులు సరిగా నిర్వహించలేదన్నారు. ప్రస్తుతం టీటీడీ వివాదంపై తాను స్పందించేది లేదని స్పష్టం చేసిన ఆయన ప్రస్తుతం రమణదీక్షితులుకు ఇబ్బంది వచ్చింది కనుక ఆయన ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.