ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగ సంఘాల నేతలతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 12:34 PM

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలాసలో ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై పవన్‌ నేతలతో చర్చించారు. ఉద్యోగుల డబ్బుతో ప్రభుత్వం వ్యాపారం చేయడమేంటని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. తనకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తెలుసునన్నారు. సీపీఎస్‌ విధానంపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని పేర్కొన్నారు. తన యాత్ర ఆషామాషీ కోసం కాదని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకేనని అన్నారు.  అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com