విజయవాడ: విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా ముందుందని కేంద్రమంత్రి కిరణ్రిజిజు అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హుద్హుద్ తుపాను ఎదుర్కోవడంలో ఏపీ చొరవ అభినందనీయమన్నారు. విపత్తు సమయాల్లో సత్వర స్పందన, నివారణ చర్యలతో నష్టం తగ్గించగలుగుతామని పేర్కొన్నారు. ఎన్ఐడీఎం ఏర్పాటు వెంకయ్యనాయుడు వల్లే సాధ్యమైందన్నారు. ఈ సంస్థ ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తామన్నారు. విపత్తు నిర్వహణలో దేశవ్యాప్తంగా రూ.2వేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు కింద పనులు జరుగుతున్నాయన్నారు.