విజయవాడ: కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొండపావులూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు శంకుస్థాపన చేశారు. దక్షిణాది రాష్ట్రాల కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహించేలా ఎన్ఐడీఎం ఏర్పాటు చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో పాటు ఎంపీ కొనకళ్ల, మాజీ మంత్రి కామినేని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి కొల్లు రవీంద్రలు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేస్తున్న ఎన్ఐడీఎంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది ఎకరాల స్థలాన్ని కేటాయించగా, కేంద్రం రూ.37 కోట్ల నిధులను కేటాయించింది. ఏడాదిన్నరలో భవన నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.