హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించిన వైసీపీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 29న వైసీపీ ఎంపీలతో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పీకర్ కార్యాలయంలో భేటీ కానున్నారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వైసీపీ ఎంపీలు స్పీకర్ను కోరారు. కలిసేందుకు సమయం ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ స్పీకర్కు సందేశం పంపారు. ఈ నేపథ్యంలో స్పీకర్ను వ్యక్తిగతంగా భేటీ కావాలని వైసీపీ ఎంపీలకు తాజాగా స్పీకర్ కార్యాలయం ఈ-మెయిల్ పంపింది. ఈనెల 29న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సమావేశం కావాలని ఈ-మెయిల్లో పేర్కొన్నారు.