న్యూఢిల్లీ: డాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థ డైరక్టర్ ప్రదీప్ బర్మన్కు చెందిన సుమారు 20.87 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సీజ్ చేసింది. ఫెమా చట్టంలోని 37ఏ ఉల్లంఘన కింద విదేశాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నట్లు తేలింది. డాబర్ డైరక్టర్ ప్రదీప్ దగ్గర అక్రమాస్తులు ఉన్నాయని, విదేశాల్లో ఆయన పెట్టుబడులు ఉన్నట్లు గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నల్లకుబేరుల జాబితాలో ఉంది. విదేశీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని ఆయనపై ఐటీశాఖ కూడా కేసు నమోదు చేసింది. డాబర్ సంస్థకు చెందిన కుటుంబీకుల్లో ప్రదీప్ ఒకరు. ప్రస్తుతం డాబర్ మార్కెట్ విలువ సుమారు 37వేల కోట్లు ఉంటుంది. జెనీవాకు చెందిన హెచ్ఎస్బీసీ జాబితాలో ఆయన పేర్లు ఉన్నాయి. అయితే విదేశీ అకౌంట్లు కలిగి ఉన్న కేసును 2011 నుంచి విచారిస్తున్నారు.మ ఆ కేసులో అతను 8 కోట్లు జరిమానా కూడా చెల్లించాడు.