తిరుమలలో రద్దీ విపరీతంగా ఉంది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు వచ్చే భక్తులతో కిక్కిరిసి పోయి ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 57 గంటల సమయం పడుతోంది. నడక దారి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలగడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.