విభజన హామీల అమలు చేయక పోవడంపై విశాఖలో ఇవాళ ధర్మపోరాట సభ జరగనుంది. విశాఖ ఆంధ్ర విశ్వ కళాపరిషత్ సాంకేతిక కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ధర్మపోరాట సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. లక్ష మందికి పైగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ధర్మపోరాట సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ధర్మపోరాట సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు సాగనుంది.