న్యూఢిల్లి : కర్ణాటకలో బిజెపి ఓటు గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. కర్ణాటక ప్రజలు బిజెపిపై విశ్వాసముంచారని ఆయన చెప్పారు. ఆ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ తమదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 3700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు.