ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలాస చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 03:18 PM

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోంపేట నుంచి పలాస చేరుకున్నారు. సోంపేట అమరవీరుల స్థూపం దగ్గర పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి పవన్‌ పలాస చేరుకున్నారు.  పలాసలో  పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో పవన్‌ అభిమానులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోంపేట నుంచి పలాస చేరుకున్నారు. పలాసలో పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. పవన్‌ను చూసేందుకు పోటీపడ్డ అభిమానులపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. దీంతో బౌన్సర్ల తీరుకు నిరసనగా పవన్‌ అభిమానులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com