లక్నో : ప్రభుత్వ బంగళాలో మరొక రెండేళ్లపాటు ఉంటానని, అందుకు అనుమతించాలని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగళాలలో ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అఖిలేష్ తనకు మరొక రెండేళ్లపాటు ప్రభుత్వ బంగళాలో ఉండేందుకు అవకాశమివ్వాలని కోరారు.