న్యూఢిల్లి : జనక్పురి వెస్ట్నుంచి కల్కాజి మందిర్ వరకూ నిర్మించిన మెజెంటా లైన్ మెట్రో రైలు సర్వీసులు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇక్కడి నెహ్రూ ఎన్క్లేవ్ మెట్రో స్టేషన్లో జెండా ఊపి మెట్రోను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గొంటారు.