శ్రీకాకుళం:జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. సోంపేట అమరవీరుల స్థూపం వద్ద పవన్ నివాళులర్పించారు. అనంతరం మహిళలతో పవన్ కల్యాణ్ ముఖాముఖిలో పాల్గొన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక ఆడపిల్లలు చదువులు మధ్యలో ఆపేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భద్రత లేక ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేస్తున్నారన్నారు. నెలసరి సమస్యలకు కూడా వైద్యం దొరకడం లేదని పేర్కొన్నారు. ఆడ పిల్లలకు సమస్యలు ఉండవద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు ఉండాలన్నారు. ప్రతి పంచాయతీలో ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్, స్కూల్ ఉండాలన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు.