అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రుద్దం మండలం తురకలాపట్నం చెరువు వద్ద జలహారతి కార్యక్రమం జరిగింది. జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రొద్దం మండలం తురకలాపట్నం చెరువు వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అనంతరం తురకలాపట్నం ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఎస్సీ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని చంద్రబాబు పలకరించారు. తురకలాపట్నం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.