న్యూఢిల్లి : నిఫా వైరస్ వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వైద్యలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) డైరెక్టర్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ బృందం కేరళ చేరుకుని నిఫా వైరస్కు గురైన వారిని పరీక్షించి పరిస్థితిని అంచనా వేయనున్నది.