న్యూఢిల్లి : జెడిఎస్ నేత కుమార స్వామి ఢిల్లిలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ – జెడిఎస్ కూటమి అభ్యర్థిగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న కుమారస్వామి తన ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించడానికి ఇక్కడకు వచ్చారు. యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులతో సమావేశమై వారిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు.