తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. మొత్తం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు స్వామి వారి దర్శనానికి కూడా నాలుగు గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.