భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం స్థానంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని పెట్టాలంటూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగ్రా ముసినిపల్ కార్పోరేషన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో అండేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యూపీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆగ్రామునిసిపల్ కార్పొరేషన్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాలు రెండు ఉన్నాయి. వాటిలో ఒక విగ్రహాన్ని తీసివేసి ఆ స్థానంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తొలుత ఈ ప్రతిపాదన చేస్తూ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు.