గిరిజనుల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మాదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలను, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గిరినుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గిరిజనుల స్థితిగతులపై జగన్కు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఐటీడీఏ వ్యవస్థను నాశనం చేసింది రాజశేఖర్రెడ్డియేనన్నారు. 1.6లక్షల ఎకరాల బయ్యారం గనులను జగన్ బావకు కట్టబెట్టారని ఆరోపించారు. వైఎస్ బంధువు పెన్నా ప్రతాప్రెడ్డికి విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ గనులు కట్టబెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. గిరిజనుల ఉపప్రణాళిక నిధులను ఇడుపులపాయకు ఖర్చు పెట్టుకున్న చరిత్ర వీరిదన్నారు.