హైదరాబాద్: రమణ దీక్షితులు ఆరోపణలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ గౌడ్ ఖండించారు. ఆయన ఆరోపణలను ఆయన విజ్ణతకే వదిలేస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తుల సేవకే తప్ప పెత్తనానికి కాదని పేర్కొన్నారు. ఆరోపణలకు భద్రత కరవు అన్న రమణదీక్షితులు ఆరోపణలకు ఆయన ఖండించారు. శాస్త్రోక్తంగా కాకుండా హడావుడిగా పూజలు నిర్వహించడం బాధ కలిగిస్తుందని రమణదీక్షితులు అన్నారు. దేవాలయంలో సిబ్బంది, అధికారులకు అందరికీ తెలిసిన విషయమన్నారు. స్వామివారి అర్చన కైంకర్యాలపై మహర్షులు మనకే పూర్వమే చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలనే స్వామివారిని అర్చకులు ప్రార్థిస్తారన్నారు. ఉన్నతమైన అర్చక వృత్తిలో మానవ తప్పిద అపచారాలు జరిగినప్పుడు బాధపడుతుంటామన్నారు.