హైదరాబాద్: తిరువాభరణాలపై సీబీఐ వంటి అత్యున్నత స్థాయి సంస్థతో దర్యాప్తు జరిపించాలని రమణదీక్షితులు డిమాండ్ చేశారు. ఈరోజిక్కడ రమణదీక్షితులు మాట్లాడుతూ స్వామివారి నగల్లో విలువైన గులాబీ రంగు వజ్రం కనిపించకుండా పోయిందని పేర్కొన్నారు. ఇటీవల జెనీవాలో గులాబీ రంగు వజ్రం వేలానికి వచ్చిందన్నారు. పాత ఆభరణాలను స్వామివారి అలంకరణకు తీసుకురావట్లేదన్నారు. పాత నగల్లో అత్యంత విలువైన రత్నాలు ఉన్నాయన్నారు.