యువత మద్దతు, పెద్దల ఆశీస్సులుంటే 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగతా పార్టీల మాదిరిగా కులాలను విడదీసి పబ్బం గడపనన్నారు. ప్రజాసేవే మా పార్టీ సిద్ధాంతమన్నారు. తానెప్పుడూ పదవులు కోరుకోలేదని, పని చేయడానికే ఇష్టపడతానని పేర్కొన్నారు. తన పర్యటన సమస్యలను అవగాహన చేసుకునేందుకేనన్నారు.