శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ తెల్లవారు జామున మృతి చెందిన వైసీపీ సలహాదారు సోమయాజులు భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సోమయాజులు మృతి చెందిన సమాచారం తెలుసుకున్న జగన్ తన 167వ రోజు పాదయాత్రను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. సోమయాజులు భౌతికకాయానికి నివాళులర్పించిన జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.