బెంగళూరు : కర్ణాటక శాసనసభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప రేపు బల నిరూపణ చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించిందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. తాము ముందుగా గవర్నర్ను కలిశామని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ తక్కువ మెజారిటీ ఉన్న యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారన్నారు.