తిరుపతి : సుప్రీం కోర్టు తీర్పును జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెడ్ డి దేవెగౌడ స్వాగతించారు. తిరుపతిలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సభలో మెజారిటీ లేకుండా అధికారం కోసం అర్రులు చాచిన బీజేపీకి సుప్రీం తీర్పు చెంపపెట్టని ఆయన పేర్కొన్నారు. బల నిరూపణలో యెడ్యూరప్ప విఫలం అవుతారని ఆయన జోస్యం చెప్పారు.