కర్ణాటక శాసనసభలో రేపు బల నిరూపణకు కాంగ్రెస్, జెడిఎస్ సిద్ధంగా ఉన్నాయని ఆ పార్టీల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న అభిషేక్ సింఘ్వి అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యడ్యూరప్ప సిద్ధంగానే ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. యడ్యూరప్ప తమకు 104 మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పారని, ఆధిక్యత కూడగట్టుకునేందుకు సమయం అడిగారని ఆయన అన్నారు. ఏ విధంగా మద్దతు కూడగట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.