న్యూఢిల్లి : సుప్రీంకోర్టులో మరికొద్దిసేపటిలో కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటు అంశంపై విచారణ ప్రారంభం కానున్నది. కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది. జస్టిస్ సిక్రీ, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్డేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనున్నది. కాంగ్రెస్-జెడిఎస్ తరఫున అభిషేక్ సింఘ్వి, కేంద్ర ప్రభుత్వం తరఫున ఎజి వేణుగోపాల్, బిజెపి తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు.