న్యూఢిల్లి : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బంధువు మెహుల్ చోక్సికి చెందిన గీతాంజలి గ్రూప్నుంచి భారీయెత్తున ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. 85 కోట్ల రూపాయిల విలువైన 34 వేల ఆభరణాలను ఇ.డి. అధికారులు స్వాధీనం చేసుకున్నారు.