కర్ణాటకలో బిజెపికి తగినంత సంఖ్యాబలం ఉందని ఆ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్న న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. గవర్నర్కు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇచ్చిన లేఖను సుప్రీంకోర్టులో సమర్పించనున్నామని ఆయన అన్నారు. ఎలాంటి హార్స్ ట్రేడింగ్ జరుగలేదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించిన దృష్ట్యా బలాన్ని, మద్దతును సభలోనే నిరూపించుకుంటామని ఆయన అన్నారు.