విజయవాడ: కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహానాడుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపారు. గురువారం పెనమలూరు పీఎస్లో ఏర్పాట్లపై పర్యవేక్షించిన అనంతరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు రానున్నారన్నారు.