తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నడకదారి భక్తులకు ఉదయం 10గంటల నుంచి టైంస్లాట్ కింద టీటీడీ అధికారులు టోకెన్లు జారీ చేయనున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 26 గంటల సమయం పడుతోంది. నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.