చేనేత కార్మికులకు త్వరలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన టీడీపీ మినీమహానాడులో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ సీజేఎఫ్ఎస్ లబ్ధిదారులకు భూహక్కులు కల్పిస్తూ త్వరలో పట్టాలు అందజేస్తామన్నారు. సీజేఎఫ్ఎస్ లబ్ధిదారులకు వ్యవసాయ రుణాల అర్హత కల్పిస్తామని పేర్కొన్నారు. సీజేఎఫ్ఎస్ భూములకు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో 65వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. సోమశిల స్వర్ణముఖి కాలువ పనులు పూర్తి చేస్తామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. డక్కిలి మండలం ఆల్కూరుపాడులో రూ.350 కోట్లతో ఆనకట్ట నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. ఎస్ఎస్ కాలువ ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 270 చెరువులకు నీళ్లందిస్తామన్నారు. జూన్ 2లోపు పెండింగ్లో ఉన్న 3లక్షల మంది దరఖాస్తుదారులకు పింఛన్లు ఇస్తామన్నారు. జూన్ నాటికి లక్షన్నర మందికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.