న్యూఢిల్లీ :కర్నాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ కర్నాటకలో దొడ్డిదారిన అధికారంలోనికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించిందని విమర్శించారు. బిజెపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కర్ణాటకలో అనైతికంగా బిజెపి ప్రభుత్వ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. మెజారిటీ లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.