రాష్ట్రంలో పొగాకు ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సీఎంవో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పొగాకు ధరల పతనంపై మీడియా కథనాలపై చంద్రబాబు స్పందించారు. పొగాకు బోర్డు అధికారులతో చర్చ సారాంశాన్ని అధికారులు చంద్రబాబుకు వివరించారు. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పొగాకు ధరలపై సీఎంవో అధికారులతో నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ పొగాకు ధరలపై అవసరమైతే కేంద్రమంత్రితో చర్చించాలని ఆదేశించారు. మార్కెట్లో పంటల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని అధికారులను సూచించారు. కందులు, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్నారు. పొగాకు ధరలపై రాష్ట్ర మంత్రి ఢిల్లి వెళ్లి కేంద్రమంత్రితో చర్చించాలన్నారు.