బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎడ్యూరప్ప రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు. రూ.56 వేల కోట్ల రూపాయల రైతు రుణాల మాఫీపై సీఎం ఎడ్యూరప్ప తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో రైతుల రుణాలను మాఫీ చేస్తాననీ, ఆ ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే.