బెంగళూరు : కర్ణాటకలోని విధానసౌధలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్, జెడిఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో గవర్నర్ వ్యవహరించిన తీరును వారు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే, ఆజాద్, పరమేశ్వర, వేణుగోపాల్, సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు.