ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 164వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు. జగన్ తన 164వ రోజు పాదయాత్రను పెరుగ్గూడెం శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ద్వారకా తిరుమల మండలం రాజా పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, తిరుమలపాలెం మీదుగా పావులూరివారిగూడెం వరకు కొనసాగనుంది.