తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 27 గంటల తర్వాత నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు అందుబాటులోకి రానున్నాయి. టైమ్ స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు 2 నుంచి 3 గంటల లోపు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. నిన్న శ్రీవారిని 71,318 మంది భక్తులు దర్శించుకోగా, 37,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.