బెంగళూరు : జెడిఎస్ పార్టీలో చీలిక తీసుకురావడానికి బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని జెడిఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కుమారస్వామి చెప్పారు. మత విశ్వాసాలను రెచ్చగొట్టి బిజెపి విజయం సాధించిందని ఆయన అన్నారు. కర్ణాటకలో సెక్యులర్ ఓట్లు చీలిపోయాయని ఆయన అన్నారు. 104 సీట్లతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. ప్రధాని మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. అధికారం కోసం బిజెపి తహతహలాడుతోందని, ఆ పార్టీని నిరోధించేందుకే కాంగ్రెస్తో కలిసి వెళుతున్నామని ఆయన అన్నారు.