బెంగళూరు : జెడిఎస్లో చీలిక వస్తుందనే ఊహాగానాలకు నేడు జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఫుల్స్టాప్ పెట్టారు. జెడిఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో పార్టీని వీడుతారన్న వదంతులకు తెరదించుతూ ఆయన నేడు కుమారస్వామితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తామంతా ఒక్కటేనని, తమలో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు.