తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాద ఘటన వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 40 అడుగుల లోతులో గుర్తించిన పడవను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది భారీ క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 300 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. లాంచీ ప్రమాదం ఘటనపై పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, సీఎంవో అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు గాలింపు, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మరిన్ని క్రేన్ల సహాయంతో వెంటనే లాంచీని బయటకు తీయాలని, మృతదేహాలను పోస్టమార్టం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలు దొరికితే పోస్ట్మార్టం చేసేందుకు పోలవరంలో ఏర్పాట్లు చేశారు.