సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో రైతు బంధు పథకం చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్రావు రైతులకు చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామానికి విచ్చేసిన మంత్రి హరీశ్రావుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అలాగే గ్రామంలో నిర్వహించిన ద్విచక్ర ర్యాలీలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. పంచాయతీ భవనానికి హరీశ్రావు శంకుస్థాపన చేశారు.