ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత గుంటూరులో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 16, 2018, 10:53 AM

పాత గుంటూరులో దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాత గుంటూరులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. బాలికపై యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు రాళ్ల దాడికి దిగారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. దాడిలో 22 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి దాడి ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com