పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇవాళ 163వ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జగన్ తన 163వ రోజు పాదయాత్రను కొద్దిసేపటి క్రితం దెందులూరు శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర జోగన్నపాలెం, అప్పారావుపాలెం, శ్రీరామవరం, బైగానిపేట, మేదినరావుపాలెం, రామారావుగూడెం క్రాస్ చల్ల చింతలపూడి మీదుగా పెరుగుగూడెం వరకు కొనసాగనుంది.