బెంగళూరు : కర్ణాటకలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించిందని, ఇప్పటికే 112 సీట్ల ఆధిక్యంలో ఉన్నామని ఆ పార్టీ నాయకుడు సదానందగౌడ చెప్పారు. జెడిఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరుగుతున్నది. ఉదయం 10 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం ప్రాంతాల వారీగా ఆధిక్యతలు ఈ కిందివిధంగా ఉన్నాయి. బెంగళూరులో బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయాయి. సిద్దరామయ్య ఐదేళ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా దీనిని వారు అభివర్ణిస్తున్నారు.