తిరుపతి : తిరుపతిలోని అలిపి వద్ద బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయి పై టిడిపి నేతలు, కార్యకర్తల రాళ్ల దాడిని నిరసిస్తూ తిరుపతిలోని నాలుగుకాళ్ల మంటపం వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని నినాదాలు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి చినరాజప్ప తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి దిగిన టిడిపి నేతలను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.